దేవాలయంలో మనం ప్రదక్షిణలు ఎందుకు చేస్తాము 1 20 జూన్, సోమవారం - భక్తి-ఆరోగ్యం - హిందు(సనాతన ధర్మం) సాంప్రదాయంలో ప్రదక్షిణ అనగా కుడి వైపున( దక్షిణ అనగా కుడి అని అర్థం). కాబట్టి భక్తులు తమ కుడి వైపున ప్రతిస్ఠంచిన విగ్రహం లేదా గర్భగుడి ఉండగా, వారి ఎడమవైపు నుండి సవ్య దిశలో చుట్టు నడవడం అని అర్థం. అలాగే భక్తులు పవిత్రమైన అగ్ని, చెట్లు(ఉ - వేప), మొక్కలు(ఉ - తులసి) మరియు పుణ్యక్షేత్రాలలో ప్రదక్షినచేయడం అనేది ప్రధాన ఆచారాలలో ఒకటి. ప్రధానంగా ఆరాధన ( పూజ ) పూర్తయిన తర్వాత భక్తి శ్రద్ధలతో ప్రదక్షిణలు చేస్తారు. (రిగ్వేద శ్లోకం: 2.42.3 మరియు 2.43.1) – ప్ర అనగా చాలా లేక ముందుకు, వైపుకు, కావున దక్షిణ-వైపుగా పరిక్రమించు అని అర్థం. కుడి వైపున గర్భగుడిలో ప్రతిస్ఠంచిన విగ్రహం ఉండగా చుట్టూ ప్రదక్షిణ చేయడం అనేది పవిత్రమైన ఆచారంగా రీగ్వేదంలో పేర్కొనబడింది. స్కంద పురాణం(చ.9 వ.68) - ప్రదక్షిణలోని ప్రతి అక్షరం, ప్ర - పాప తత్వంతో, ద - పొందిన, క్షి - కర్మను నశింపజేసి, న- మోక్షం కలిగించును అని స్కంద పురాణంలో తెలుపబడింది. ప్రదక్షిణలు ఎందుకు సవ్య పద్ధతిలోనే చేయవలెను హిందువులు ఆలయాంలోని దేవతల గర్భగుడి లేదా తమతమ ఇంట్లోని దేవతల పూజా విగ్రహాలు, యజ్ఞగుండం చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. దేవుడు ఎల్లప్పుడు మన ఉనికిలోని కేంద్ర బిందువుగా మరియు అన్ని ప్రదేశాలలో కెలువైఉన్నాడని భావిస్తాము. అందువలన మన చర్యలు మరియు ఆలోచనలు ఎల్లప్పుడూ దేవుని చుట్టూ కేంద్రీకృతమై, మనం ఎంతదురంనుంచి ప్రదక్షిణలు చేసినా ప్రధాన స్ధానం(ఉనికి) ఎల్లప్పుడూ కేంద్రీకృతమై ఉండునని అంగీకరిస్తున్నాము. దేవుని యొక్క గురుత్వ కేంద్రాన్ని మరియు మన ఉనికిపైన దృష్టిని తెలియజేయునదే ప్రదక్షిణలోని శాశ్వత సత్యం. సౌర వ్యవస్థలో , సూర్యుడు కేంద్రగా గ్రహాలు ఎలాగైతే చుట్టూ తిరుగుతున్నాయో అలాగనే మనం దేవుడిని కేంద్రంగా భావించి ప్రదక్షిణలు చేయవలెను. ప్రదక్షిణలు ఎప్పుడూ తొందరపాటు, వేగంగా కాకుండ నిదానంగా దేవునిపై భక్తి శ్రద్ధలతో చేయవలెను. భగవంతుడు ఎప్పుడూ మన కుడి వైపునే ఉంటాడని భావిస్తూ, మనం ఎల్లప్పుడు ధర్మ మార్గంలోనే నడువవలనని గుర్తుచేసుకుంటూ ప్రదక్షిణలు ఎప్పుడూ సవ్య దిశలోనే చేయవలెను.మనస్సు ద్వారా చేసినటువంటి పాపాములు మొదటి అడుగు (ప్రదక్షిణ)లో, వాక్కు(మాటలు) ద్వారా చేసినటువంటి పాపాములు రెండవ అడుగులో, శరీరం ద్వారా చేసినటువంటి పాపాములు మూడవ అడుగులో నాశనం అవుతాయి అని స్కంద పురాణం చ.9 వ.28 లో పేర్కొనబడింది. ప్రదక్షిణ సంఖ్య ప్రకారం గణపతికి ఒకటి, సూర్యునికి రెండు, శివునికి మూడు, దేవి విష్ణుమూర్తులకు నాలుగు మరియు అత్తి చెట్టుకి చేయవలెనని సూచింపబడింది. మనస్సులో భగవంతుని రూపాన్ని తలచుకుని నమస్కరించి ప్రదక్షిణ చేయడం వలన భక్తులు తమలోని అహం బావాన్ని పారద్రోలగలుగుతారు. Next >>